E-Paper
Advertisement

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో  తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో
Advertisement

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భవానీలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో గురువారం వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించిన తరహాలోనే దసరా రోజున కూడా అన్ని క్యూ లైన్ లలో ఉచిత దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.

కృష్ణానది వరద ఉద్ధృతితో అమ్మవారి తెప్పోత్సవం, జలవిహారం రద్దు చేశామని ఈవో తెలిపారు. అయితే శివాలయం నుంచి దుర్గా ఘాట్ వరకు ఊరేగింపుగా వెళ్లి శాస్త్రోక్తంగా జరపాల్సిన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భక్తుల రద్దీ కారణంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దసరా రోజున క్యూలైన్లోని భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. గురువారం ఉదయం జరిగే పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

పదో రోజు రూ.62 లక్షల ఆదాయం

Advertisement

దసరా ఉత్సవాలలో పదో రోజు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రూ. 62 లక్షల 16 వేల 970 ఆదాయం వచ్చిందని ఈవో శీనా నాయక్ తెలిపారు. రూ.15 లడ్డూలు 12,847 విక్రయించగా 1,92,705 రూపాయలు , వంద రూపాయల లడ్డూ బాక్స్ లు 54,705 విక్రయించగా రూ.54,70,500 ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా రూ.36 వేలు, చండిహోమం ద్వారా రూ.24 వేలు, ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా రూ.20,464, ఫోటో క్యాలెండర్ల విక్రయం ద్వారా 6,170 రూపాయలు, కేశఖండన ద్వారా రూ.4,58,720 ఇతరత్రా 8,411 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.

బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 85,094 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. చిన్నారులు తప్పిపోకుండా 5,042 ట్యాగ్ లు వేశామన్నారు. 25,533 మందికి అన్న ప్రసాద వితరణ, 17,29,057 లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు.

తొమ్మిది రోజుల్లో రూ.3 కోట్ల 55 లక్షల ఆదాయం

Advertisement

దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దుర్గగుడికి రూ.3 కోట్ల 55 లక్షల 82 వేల 374 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. ఉత్సవాలలో లడ్డూ ప్రసాదాలు, దర్శన టికెట్లు, ప్రత్యేక పరోక్ష కుంకుమార్చనలు, చండీ హోమం, శ్రీ చక్ర నవార్చన, ప్రత్యేక ఖడ్గమాల టికెట్ల విక్రయం రూపేణా ఈ ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు.

Also Read: Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

9 రోజుల్లో 11 లక్షల మందికి దర్శనం

సెప్టెంబర్ 22 నుండి 30వ తేదీ వరకు 11,28,923 మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు ఈవో చెప్పారు. ఈ తొమ్మిది రోజుల్లో చిన్నారులు తప్పిపోకుండా 49, 597 ట్యాగ్ లు చిన్నపిల్లలకు వేశామన్నారు. 2, 33,116 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×