Case On Ambati: అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు తీవ్రమవుతున్నాయి. తాము అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారు. ఏదో విధంగా క్రెడిట్ తెచ్చుకోవాలనే ఆరాటపడుతున్నారు. ఫలితంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఫలితంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పద్మనాభం అంత్యక్రియల విషయంలో మాజీ మంత్రి అంబటిరాంబాబుపై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
ముద్రగడ అంత్యక్రియల్లో అంబటి దూకుడు-వైసీపీ నేత అంబటి రాంబాబుపై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసు సిబ్బంది గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా వారిపై దురుసుగా ప్రవర్తించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తన మద్దతు దారులతో కలిసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
కేసు నమోదు చేసిన కిర్లంపూడి పోలీసులు-ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో ఆయనపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న తమను ఉద్దేశపూర్వ కంగా తోసివేశారని అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో అంబటిపై సెక్షన్లు 132, 3(5) అంబటితోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గతంలో కూడా పలు కేసులు నమోదు- ముద్రగడ చివరి కోరికను అమలు చేసామని అంబటి చెబుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముద్రగడ అంత్యక్రియల కంటే అంబటి చేసిన వ్యవహారం పెద్ద రచ్చగా మారింది. ముద్రగడ కుటుంబసభ్యులు కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు చేశారు.
అంబటిపై ఈ కేసు ఒక్కటే కాదు. గతంలో వైసీపీ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా ఆయనతోపాటు అంబటి రాంబాబు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయన దురుసు ప్రవర్తన కారణంగా పలు సందర్భాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఒకానొక దశలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులు ఆయన జైలుకి వెళ్లిన విషయం తెల్సిందే.
ALSO READ: అక్రమ సంబంధం చిచ్చు.. గుడికి తీసుకెళ్లి భర్తను లేపేసిన భార్య, చిత్తూరు జిల్లాలో దారుణం
కిర్లంపూడి పోలీసులు కేసు నమోదుపై అంబటి ఇంకా రియాక్ట్ కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో తన ఇంటిపై దాడికి నిరసనగా అంబటి రాంబాబు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. అయితే దీక్షకు ముందస్తు అనుమతి లేకుండా చేపట్టడం, దీనివల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు.
గతేడాది జూన్లో కూడా పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారు. దీంతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి వైసీపీ అధికారం అంబటిపై కనీసం ఆరు నెలలకు ఒకటి చొప్పున కేసు నమోదు అవుతుందని అంటున్నారు.