Nara Lokesh: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేంద్ర మత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిన విషయమే.. అయితే ఈ కేసు పై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గతంలో మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేసి భయంతో ఇంటికొస్తే చేసింది తప్పని పోలీసులకు సరెండర్ చేయాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులకు ఉండాలని అన్నారు.
మోన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్రమంత్రి కొడుకుపై ఫోక్సో కేసు ఆరోపణలు వస్తే స్వయంగా ఆయనే తీసుకెళ్లి సరెండర్ చేశారని నారాలోకేష్ గుర్తు చేశారు. మిగతా వారు ఇలా చేయకుండా ఇష్టం మొచ్చినట్టు మాట్లాడుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఓ గొర్రెల కాపరిని బైక్తో ఢీకొట్టి రైతు మృతికి కారణమయ్యాడు. దీంతో ఆరవ్ వర్మను తప్పించేందుకు సీదిరి ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
Also read: YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!
అయితే యాక్సిడెంట్ జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరవ్ వర్మే యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దీనిని ఉద్దేశించి తెలంగాణలోని భండి బగీరథ్ కేసును పోల్చుతూ కేంద్ర మంత్రి కుమారిడినే తప్పుచేస్తే ఏవిదంగా అయితే పోలీసులకు అప్పగించాడో అదేవిధంగా చేయాలే తప్పా, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అనే యాంగిలో నారాలోకేష్ మాట్లాడారు.