BigTV English

AP Election Commissioner : ఢిల్లీకి ఏపీ ఎన్నికల కమిషనర్‌.. సీఈసీ నుంచి పిలుపు అందుకేనా..?

AP Election Commissioner : ఢిల్లీకి ఏపీ ఎన్నికల కమిషనర్‌.. సీఈసీ నుంచి పిలుపు అందుకేనా..?

AP Election Commissioner : ఏపీలో ఓటర్ల జాబితా చాలారోజులుగా వివాదం రేపుతోంది. భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రజల నుంచి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేక చోట్ల ఒకే అడ్రస్ పై భారీగా ఓట్లు నమోదైన వివరాలు బయటకొచ్చాయి. ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని విపక్షాలు ఆరోపించాయి.


ఇలా ఓటర్ల జాబితాపై వివాదాలు కొనసాగుతున్న వేళ ఏపీ ఎన్నికల కమిషనర్‌ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపురావడం ఆసక్తిగా మారింది. దీంతో సీఈసీని కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఢిల్లీకి పిలిచారని సమాచారం.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్థానిక యంత్రాంగం ఇచ్చివచ్చినట్లుగా ఓట్ల చేర్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలవడం ఆసక్తిని రేపుతోంది.


Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×