BigTV English

Phone Tapping : మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. అందుకే హైదరాబాద్ లోనే చంద్రబాబు..?

Phone Tapping : మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. అందుకే హైదరాబాద్ లోనే చంద్రబాబు..?
Phone Tapping


Phone Tapping (Andhra Pradesh news ) : ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ దుమారం తెరపైకివస్తోంది. ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు నేతల డేటా కూడా బయటకు వెళ్తోందని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సాయంత్రం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే టీడీపీ బృందం డీజీపీ అపాయింట్మెంట్‌ కోరింది.

కొంత కాలంగా నేతల ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయని.. అందుకే తమ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే హైదరాబాద్‌ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్వేక్షిస్తున్నారని అంటున్నారు. పార్టీలో జాయినింగ్స్, ఇతర యాక్టీవిటీలను హైదరాబాద్‌ నుంచే పర్వేక్షిస్తున్నారని చెబుతున్నారు. ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉంటేనే చంద్రబాబు అమరావతికి వస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.


గతంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దుమారానికి కారణమైంది. ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అది తీవ్ర దుమారానికి కారణమైంది. కోటంరెడ్డి అవతలి వ్యక్తితో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ అది.. అంతే తప్ప ఎలాంటి ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తాజాగా టీడీపీ నేతలు డీజీపీని కలిసి ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవడం ఏపీ పాలిటిక్స్‌లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×