BigTV English
Advertisement

Chandrababu hot comments jagan govt: నంద్యాల షోలో బాబు, జగన్ కుటిల ప్రయత్నాలు, శవ రాజకీయాలు కూడా..

Chandrababu hot comments jagan govt: నంద్యాల షోలో బాబు, జగన్ కుటిల ప్రయత్నాలు, శవ రాజకీయాలు కూడా..

Chandrababu hot comments jagan govt: ఎన్నికల్లో గెలిచేందుకు అధికార వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు చంద్రబాబు. పొత్తుల్లో భాగంగా జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంటే .. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లను ప్రొత్సహిస్తూ గాజు గ్లాసు గుర్తును కేటాయించేలా చేశారని దుయ్యబట్టారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదేనన్నారు చంద్రబాబు.


యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తామన్నారు చంద్రబాబు. యువత అంతా సైకిల్ ఎక్కాలని పిలుపు నిచ్చారు. జాబు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. తాను, పవన్ కల్యాణ్ వల్లే ఇదంతా సాధ్యమవుతుందన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రెండో సంతకమన్నారు.

పెంఛన్లు వెయ్యి నుంచి మూడు వేలకు తాము పెంచామంటూ సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని గుర్తు చేశారు టీడీపీ అధినేత. ఆయన ఓ శాపం ఉందని, నిజం చెబితే తల బద్దలై వేయి ముక్కలు అవుతుందన్నారు. వృద్దులను చంపి శవ రాజకీయాలు చేసే మనిషి జగన్ అని ఆరోపించారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పుకొచ్చారు.  ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామన్నారు. జులైలో బకాయిలతో కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తామన్నారు.


శనివారం నంద్యాలలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారాయ. వారసత్వం భూమిపై సైకో ఫోటో ఉండకూదన్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ఓ పాటను వినిపించారు. బాధితుడు న్యాయవాదికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. భూచట్టం వల్ల అందరికీ ఉరితాడు వేశారని దుయ్యబట్టారు.

ALSO READ: భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే.. కడప బహిరంగసభలో రాహుల్

జగన్ మళ్లీ వస్తే మన భూములను అమ్ముకోవడానికి వీల్లేదన్నారు చంద్రబాబు. భూములపై అన్యాయం జరిగితే నేరుగా హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉన్న పథకాలను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి ఫారూఖ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిశ్రమలు తీసుకుని ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు టీడీపీ అధినేత.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×