E-Paper
Advertisement

Chandrababu on Udayagiri: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

Chandrababu on Udayagiri: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

Chandrababu on Udaygiri:

Chandrababu on Udayagiri Kaliyugam issue : జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కలియుగం అంశంపై జగన్ చేసిన కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. గొడ్డలితో నరికిన వాడ్ని కాపాడుతూ బాధితులపై నేరం నెట్టివేయడం కలియుగం కాదా అంటూ ప్రశ్నించారు. చెల్లికి న్యాయం చేయకపోగా, ఆమెనే వేధించడం అదీ కలియుగం అని గుర్తుచేశారు.

అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే.. వాళ్లపైనే కేసులు పెట్టారు.. చివరకు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అదీ కలియుగం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పేవాళ్లు అధికారంలో ఉండడమే కలియుగం.. అలాంటి సీఎం మనకు ఉండటం కలియుగం మహిమని వివరిం చారు. ప్రజాగళం రోడ్ షోలో భాగంగా శుక్రవారం రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి రోడ్ షోలో ప్రసంగించారు చంద్రబాబు. ఈ క్రమంలో జగన్ పై విమర్శలు గుప్పించారు.

తనకు ఎవరూ లేరని.. ఒంటరివాడనని పదేపదే అబద్దాలు చెప్పడంపైనా కౌంటరిచ్చారు చంద్రబాబు. పేపర్, టీవీ అస్సలేమీ లేవని, ఆయనపై అందరూ దాడి చేస్తున్నామని చెప్పడం వెనుక ఏంటని మండిపడ్డారు. సునీత అడిగిన ఓ ప్రశ్న సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను వేటినీ మేనేజ్ చేయలేదని, రాబోయే రోజుల్లో నీ బతుకు భయంకరంగా తయారవుతుందన్నారు.

ALSO READ: పేదలంతా ఓ వైపు.. పెత్తందార్లు అంతా మరో వైపు.. సీఎం జగన్

అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవన్నారు చంద్రబాబు. తాను అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదని, కానీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు.. మీ బాబాయ్‌ని ఎవరు చంపమన్నారో చెప్పి ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక దోపిడీదారుడు.. విధ్వంస కారుడు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ధ్వజమెత్తారు. ఈ విషయంలో అందరూ ఒక్కటవ్వాలా వద్దా అని ప్రజలను కోరారు. అందుకోసమే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×