E-Paper
Advertisement

Chandrababu on Udayagiri: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

Chandrababu on Udayagiri: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?
Advertisement

Chandrababu on Udaygiri:

Chandrababu on Udayagiri Kaliyugam issue : జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కలియుగం అంశంపై జగన్ చేసిన కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. గొడ్డలితో నరికిన వాడ్ని కాపాడుతూ బాధితులపై నేరం నెట్టివేయడం కలియుగం కాదా అంటూ ప్రశ్నించారు. చెల్లికి న్యాయం చేయకపోగా, ఆమెనే వేధించడం అదీ కలియుగం అని గుర్తుచేశారు.

Advertisement

అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే.. వాళ్లపైనే కేసులు పెట్టారు.. చివరకు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అదీ కలియుగం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పేవాళ్లు అధికారంలో ఉండడమే కలియుగం.. అలాంటి సీఎం మనకు ఉండటం కలియుగం మహిమని వివరిం చారు. ప్రజాగళం రోడ్ షోలో భాగంగా శుక్రవారం రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి రోడ్ షోలో ప్రసంగించారు చంద్రబాబు. ఈ క్రమంలో జగన్ పై విమర్శలు గుప్పించారు.

తనకు ఎవరూ లేరని.. ఒంటరివాడనని పదేపదే అబద్దాలు చెప్పడంపైనా కౌంటరిచ్చారు చంద్రబాబు. పేపర్, టీవీ అస్సలేమీ లేవని, ఆయనపై అందరూ దాడి చేస్తున్నామని చెప్పడం వెనుక ఏంటని మండిపడ్డారు. సునీత అడిగిన ఓ ప్రశ్న సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను వేటినీ మేనేజ్ చేయలేదని, రాబోయే రోజుల్లో నీ బతుకు భయంకరంగా తయారవుతుందన్నారు.

Advertisement

ALSO READ: పేదలంతా ఓ వైపు.. పెత్తందార్లు అంతా మరో వైపు.. సీఎం జగన్

అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవన్నారు చంద్రబాబు. తాను అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదని, కానీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు.. మీ బాబాయ్‌ని ఎవరు చంపమన్నారో చెప్పి ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక దోపిడీదారుడు.. విధ్వంస కారుడు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ధ్వజమెత్తారు. ఈ విషయంలో అందరూ ఒక్కటవ్వాలా వద్దా అని ప్రజలను కోరారు. అందుకోసమే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×