BigTV English

Chandrababu latest news: ఏపీ ఓట్ల జాబితా పంచాయితీ.. ఢిల్లీకి చంద్రబాబు..

Chandrababu latest news: ఏపీ ఓట్ల జాబితా పంచాయితీ.. ఢిల్లీకి చంద్రబాబు..
Chandrababu naidu news today

Chandrababu naidu news today(AP political news) :

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని కొంతకాలంగా టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈనెల 28న హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.


ఓట్ల జాబితా రూపకల్పనలో ప్రతి ఊరులోనూ అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తాజాగా ఉరవకొండలో జరిగిన ఘటనలు ప్రస్తావించారు. సీఈసీ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వైసీపీ సానుభూతిపరులు దొంగ ఓట్లు చేర్చతున్నారని చంద్రబాబు విమర్శించారు. అలాగే టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై సాక్ష్యాలను సీఈసీకి అందిస్తారు.

అపాయింట్ మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతోపాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి చంద్రబాబు అన్ని ఆధారాలు అందిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.


Related News

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

Big Stories

×