E-Paper
Advertisement

Chandrababu latest news: ఏపీ ఓట్ల జాబితా పంచాయితీ.. ఢిల్లీకి చంద్రబాబు..

Chandrababu latest news: ఏపీ ఓట్ల జాబితా పంచాయితీ.. ఢిల్లీకి చంద్రబాబు..
Advertisement
Chandrababu naidu news today

Chandrababu naidu news today(AP political news) :

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని కొంతకాలంగా టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈనెల 28న హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఓట్ల జాబితా రూపకల్పనలో ప్రతి ఊరులోనూ అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తాజాగా ఉరవకొండలో జరిగిన ఘటనలు ప్రస్తావించారు. సీఈసీ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వైసీపీ సానుభూతిపరులు దొంగ ఓట్లు చేర్చతున్నారని చంద్రబాబు విమర్శించారు. అలాగే టీడీపీ అనుకూల ఓట్లు తొలగించడంపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై సాక్ష్యాలను సీఈసీకి అందిస్తారు.

Advertisement

అపాయింట్ మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతోపాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి చంద్రబాబు అన్ని ఆధారాలు అందిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×