E-Paper
Advertisement

Big Offer: నూతనంగా రెస్టారెంట్ ప్రారంభం.. కేవలం రూ. 2 లకే బిర్యానీ.. ఎక్కడంటే?

Big Offer: నూతనంగా రెస్టారెంట్ ప్రారంభం.. కేవలం రూ. 2 లకే బిర్యానీ.. ఎక్కడంటే?
Advertisement

Biryani Offer: బిర్యానీ ధర వచ్చేసి దాదాపుగా రూ. 100 నుంచి ఆ పైన ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ లో లేదా ఇతర కార్యక్రమాల్లోనూ ఫ్రీగా బిర్యానీ పెడుతుంటారు. కొంతమంది హోటల్ నిర్వాహకులు పలు ఆఫర్లు పెడుతుంటారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్లు పెడుతుంటారు. లేదా పండుగ సందర్భంగానో, అప్పుడున్నటువంటి స్పెషల్ అకేషన్ ను బట్టో అలా ఆఫర్లు పెడుతుంటారు. అయితే, ఒకతను మాత్రం చాలా తక్కువ రేటుకే బిర్యానీని ఆఫర్ పెట్టాడు. అది చాలా తక్కువ అంటే తక్కువ రేటుకే బిర్యానీని విక్రయించాడు. దీంతో జనం భారీగా ఎగబడి ఆ బిర్యానీ ప్యాకెట్లను కొన్నారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ జనాన్ని పోలీసులు అదుపు చేయలేక తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వచ్చిన ప్రకారం..

Also Read: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. ఇకనుంచి ఫటాఫట్ పరిష్కారం కానున్న సమస్యలు

Advertisement

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తేడాపల్లిగూడంలో ఉన్న ఉషా గ్రాండ్ వద్ద నూతనంగా ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ రెస్టారెంట్ వారు కేవలం రూ. 2 లకే చికెన్ బిర్యానీ అని ప్రకటించారు. దీంతో జనం అక్కడికి పోటెత్తారు. సుమారుగా 2 వేలకు మందికి పైగా ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. దీంతో ఆ రెస్టారెంట్ వద్ద కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను అదుపు చేశారు. అయితే, రూ. 2 లకే బిర్యానీ అని చెప్పి కేవలం 200 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగిలినవారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×