BigTV English

Congress Leader Sajjan Singh: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Congress Leader Sajjan Singh: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Congress Leader Sajjan Singh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో ధ్వంసమైన బంగ్లాదేశ్‌లాగా భారత ప్రజలు కూడా ఏదో ఓ రోజు ప్రధాని మోదీ అధికారిక నివాసాన్ని ముట్టడిస్తారని అన్నారు. సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సజ్జన్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ యువజన విభాగం డిమాండ్ చేస్తోంది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సజ్జన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


సమావేశంలో సజ్జన్ సింగ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో అల్లర్ల సమయంలో ప్రజలు ప్రధాని షేక్ హసీనా అధికారిక భవనంలోకి ప్రవేశించారని అన్నారు. ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. మోదీ గుర్తుంచుకోండి. మీ తప్పుడు విధానాల వల్ల కూడా ఏదో ఒక రోజు ప్రజలు మీ నివాసంలోకి ప్రవేశించి ఆక్రమించుకుంటారు. ఇదే ఇటీవల శ్రీలంకలో కూడా జరిగింది. శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి కూడా ఆందోళన కారులు ప్రవేశించారు.

Also Read: ఆ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగానే.. భగ్గమన్న విపక్షాలు.. సభలో గందరగోళం


తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం భారత్ వంతు అని సజ్జన్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయుల మనో భావాలు దెబ్బతిసేలా సజ్జన్ సింగ్ మాట్లాడటంతో పాటు.. దేశ వ్యతిరేక పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×