E-Paper
Advertisement

Chittoor Mayor Couple Case Verdict: మేయర్ దంపతుల హత్య కేసు.. న్యాయస్థానం సంచలన తీర్పు, ఐదుగురికి ఉరిశిక్ష

Chittoor Mayor Couple Case Verdict: మేయర్ దంపతుల హత్య కేసు.. న్యాయస్థానం సంచలన తీర్పు, ఐదుగురికి ఉరిశిక్ష
Advertisement

Chittoor Mayor Couple Case Verdict: చిత్తూరు మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా నిర్థారించింది. శుక్రవారం నిందితులకు మరణశిక్ష విధించింది చిత్తూరు ఆరో అదనపు కోర్టు. ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన జరగడంతో తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈసందర్బంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మేయర్ దంపతుల హత్య కేసుతో సంచలన తీర్పు

Advertisement

ఉరిశిక్ష పడినవారిలో మేయర్ భర్త మేనల్లుడు చింటూ కీలక నిందితుడు. ఈ కేసులో మొత్తం 23 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు పదేళ్లుపాటు సాగింది. 17 మంది నిర్ధోషులుగా ప్రకటించింది. విచారణ జరుగుతున్న  సమయంలో మరో నిందితుడు మరణించాడు. అతడ్ని నిర్థోషిగా తేల్చింది.  ఉరిశిక్ష పడినవారిలో చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేశ్‌లు ఉన్నారు.

పదేళ్ల కిందట ఏపీలో సంచలనం రేపింది చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు. ఈ కేసు చివరి అంకానికి చేరడంతో శుక్రవారం ఆరో అదనపు న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించారు. మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతులను మేయర్ ఆఫీసులో అత్యంత దారుణంగా నరికి చంపారు. 2015 నవంబరు 17న ఈ ఘటన జరిగింది.

Advertisement

ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష

ఈ ఘటనపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూతో పాటు 22 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నారు నిందితులు. మూడేళ్ల నుంచి సాక్షుల విచారణ జరిగింది. ఏ-1గా మేయర్ భర్త మేల్లుడు చింటూ, ఏ-2గా వెంకటా చపలతి, ఏ-3 జయప్రకాష్‌రెడ్డి, ఏ-4 మంజునాధ్‌, ఏ-5 వెంకటేశ్‌లపై నేరం రుజువైంది.

మిగతా 16 మందిని నిర్ధోషులుగా తేల్చింది న్యాయస్థానం. ఈనెల 24న ఆరో అదనపు కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. శుక్రవారం నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి. ఏ-22గా ఉన్న రమేష్‌ ఈ కేసుతో సంబంధం లేదని పిటిషన్‌ దాఖలు చేశారు. అతడ్ని తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఏ-21 శ్రీనివాసాచారి కేసు విచారణ సాగుతుండగానే మరణించిన విషయం తెల్సిందే.

ALSO READ:  తుపాను నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా

నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఆ సమయంలో చింటూ-కఠారి వర్గాలకు చెందినవారు కోర్టుకు వచ్చారు. ఇరువర్గాల మధ్య అల్లర్లు జరగవచ్చని భావించారు. ఈక్రమంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు తర్వాత నిందితులను తిరిగి జైలుకు తరలించారు పోలీసులు. న్యాయస్థానం తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసేందుకు నిందితులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

 

 

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×