E-Paper
Advertisement

CM Chandrababu Naidu: అందరూ చదువుకుంటూ పోతే ఎలా? చంద్రబాబుకు యువకుడి ప్రశ్న.. వీడియో వైరల్!

CM Chandrababu Naidu: అందరూ చదువుకుంటూ పోతే ఎలా? చంద్రబాబుకు యువకుడి ప్రశ్న.. వీడియో వైరల్!
Advertisement

CM Chandrababu Naidu: మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. కొనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో ఆయన తుఫాన్ బాధితులను పరామర్శించారు. పర్యటనలో భాగంగా సీఎం, రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో, అక్కడ ఉన్న రైతుల గుంపులోని ఒక యువకుడిని పిలిచి, “ఏం చేస్తున్నావ్ తమ్ముడూ?” అని ఆరా తీశారు.

ఆ యువకుడు వెంటనే, “వ్యవసాయం చేస్తున్నాను సార్” అని బదులిచ్చాడు. యువకుడి సమాధానానికి ఆశ్చర్యపోయిన చంద్రబాబు, “చదువుకోవడం లేదా?” అంటూ తిరిగి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రశ్నకు ఆ యువకుడు ఏమాత్రం తడబడకుండా, వ్యవసాయం ప్రాముఖ్యతను తెలిపేలా, “అందరూ చదువుకుంటూ పోతే, ఇక వ్యవసాయం ఎవరు చేస్తారు సార్?” అని సూటిగా ప్రశ్నించాడు. ఆ యువకుడి సమయస్ఫూర్తికి, వ్యవసాయం పట్ల అతనికున్న నిబద్ధతకు సీఎం చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఈ ఊహించని సమాధానం ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చినట్లయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×