E-Paper
Advertisement

USSD fraud: సైబర్ మోసగాళ్ల కొత్త మోసం.. మీ కాల్స్, ఓటీపీలు నేరుగా వారికే.. జాగ్రత్త!

USSD fraud: సైబర్ మోసగాళ్ల కొత్త మోసం.. మీ కాల్స్, ఓటీపీలు నేరుగా వారికే.. జాగ్రత్త!
Advertisement

USSD fraud: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము.. మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయింది.. మళ్లీ కేవైసీ చేసుకోవాలంటూ ఫోన్లు చేసి, ఓటీపీ అడిగి అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకున్న సైబర్ నేరగాళ్లు రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ అంటూ కోట్లలో స్కాంలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. బాధితుల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి బాధితుడి సన్నిహితులకు సందేశాలు పంపి, ఆపదలో ఉన్నామంటూ డబ్బులు పంపాలన్న మోసాలు వెలుగు చూశాయి. తాజాగా సైబర్ కేటుగాళ్లు కొత్త రకమైన  “ఫార్వర్డింగ్ స్కాం”ను ఉపయోగిస్తున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..  తరచుగా, సైబర్ మోసగాళ్ళు బ్యాంకు లేదా సెల్ ప్రొవైడర్ కంపెనీల నుంచి వచ్చినట్లు నటిస్తూ పౌరులను సంప్రదిస్తారు.  బాధితుడి KYC అసంపూర్ణంగా ఉందని లేదా సిమ్ త్వరలో డియాక్టివేట్ అవుతుందని హెచ్చరిస్తారు. ఈ మోసాలలో అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) కోడ్‌లను ఉపయోగిస్తారు. వీటినే క్విక్ కోడులని పిలుస్తారు. ఈ కోడ్‌లను ఫోన్లలో డయల్ చేసి తమ నెంబర్లకు యూజర్ల కాల్స్, సందేశాలను మళ్లీస్తారు. “వారు బాధితుడి ఫోన్లు వారికి తెలియకుండా USSD కోడ్‌ను డయల్ చేస్తారు. ఇది #, * వంటి సింబల్స్‌తో మధ్యలో నెంబర్లను కలిగి ఉంటుంది. పౌరులు అటువంటి USSD కోడ్‌లను డయల్ చేసినప్పుడు, వారి ఇన్‌కమింగ్ కాల్‌లు ఫార్వార్డ్ చేయబడతాయి” అని అధికారి తెలిపారు.

Advertisement

Read Also: Jio-Google Gemini Pro: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త… 18 నెలల పాటు ఉచితమే!

‘‘ఈ విధంగా కాల్స్ వారి నంబర్‌కు డైవర్ట్ చేసిన తరువాత బాధితుడి యూజర్ల కాల్స్, సందేశాలు, ఓటీపీలు స్కామర్లకు వెళ్తాయి. ఇది స్కామర్లకు అవకాశం కల్పిస్తుందని సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు.  సాధారణంగా, ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీలు, UPI, క్రెడిట్/డెబిట్ కార్డ్ లావాదేవీలకు OTP అవసరం. బ్యాంక్ పౌరుడి ఫోన్‌కు OTP పంపినప్పుడు, అది స్కామర్‌కు ఫార్వార్డ్ చేయబడుతుంది. ఆ తర్వాత మోసగాడు ఈ OTPని ఉపయోగిస్తాడు. తద్వారా బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా UPI యాప్ నుండి డబ్బును కొట్టేస్తాడు.’’ అని వెల్లడించారు.

Advertisement

బాధితుడు కాల్స్ అందుకోవడం లేదని గమనించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కాల్స్, సందేశాలు రాకపోయినా, వెళ్లకపోయినా నెట్‌వర్క్ సమస్య అని భావించవచ్చు. కానీ నిజానికి, వారి కాల్స్ స్కామర్ నంబర్‌కు మళ్లించబడ్డాయని గుర్తించాలన్నారు. 

సైబర్ మోసాలను నివారించడానికి జాగ్రత్తలు:

  • తెలియని వ్యక్తి చెబితే మీ ఫోన్లో USSD కోడ్‌ను డయల్ చేయవద్దు.
  • కాల్ ఫార్వార్డింగ్ యాక్టివ్‌గా ఉందో లేదో తనిఖీ చేయడానికి, ఫోన్‌లో ##21# డయల్ చేయండి.
  • “కాల్ ఫార్వార్డింగ్ ఆన్‌లో ఉంది” అని వస్తే, వెంటనే దాన్ని ఆఫ్ వేయండి.
  • అన్ని రకాల కాల్ ఫార్వార్డింగ్‌లను ఆఫ్ చేయడానికి, ##002# డయల్ చేయండి.
  • సమస్య కొనసాగితే, మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. మీ మొబైల్ నంబర్ లేదా సిమ్ సంబంధిత వివరాలను అపరిచితులతో పంచుకోవడం మానుకోండి.
  • ఇటువంటి మోసాల గురించి మరింత సమాచారం కోసం, http://www.cybercrime.gov.in ని సందర్శించండి లేదా 1930లో సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాని పోలీసులు సూచిస్తన్నారు.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×