E-Paper
Advertisement

Andhra Pradesh: విశాఖలో రెండో రోజు.. CII పార్టనర్ షిప్ సమ్మిట్..

Andhra Pradesh: విశాఖలో రెండో రోజు.. CII పార్టనర్ షిప్  సమ్మిట్..
Advertisement

Andhra Pradesh: విశాఖలో రెండో రోజు సిఐఐ సదస్సు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్‌తో పాటు.. సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేమాండ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో MOU
శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంవోయూలు.. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో భేటీ కూడా కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెషన్లలో కూడా పాల్గొంటారు. ఇవాళ పలు కంపెనీలు సీఎం సమక్షంలో పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నాయి.

Advertisement

నిన్న సదస్సులో పాల్గొన్న సింగపూర్ హోంమంత్రి షణ్ముగం..
తొలిరోజు CII భాగస్వామ్య సదస్సులో సింగపూర్ హోంమంత్రి షణ్ముగం పాల్గొన్నారు. ఏపీతో మంచి అనుబంధాలు ఉన్నాయన్నారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు, రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు ఆసక్తికరంగా ఉన్నారన్నారు. సుస్థిర అభివృద్ధి, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, రియల్‌టైమ్‌ ఎకనమిక్‌ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి అంశాల్లో.. ఏపీకి సింగపూర్‌ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

Also Read: దారుణం.. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత..

Advertisement

ఏపీలో పెట్టుబడులు పెట్టేలా తమ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు- షణ్ముగం
సింగపూర్, చంద్రబాబు పాత స్నేహితులంటూ గుర్తుచేశారు షణ్ముగం. చంద్రబాబుకు స్పష్టమైన విజన్‌ ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా తమ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు. తాము ఫోకస్ పెట్టిన ప్రాంతాల్లో ఏపీ ఒకటన్నారు. ప్రభుత్వోద్యోగులకు శిక్షణ ఇవ్వడాన్ని.. 30 ఏళ్ల క్రితమే ప్రారంభించామన్నారు. దాంతో వేలమందికి శిక్షణ ఇచ్చామన్నారు. మళ్లీ ఇప్పుడు ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×