E-Paper
Advertisement

Badvel girl murder : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు

Badvel girl murder : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు

Badvel girl murder :

బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం
రూ.10 లక్షల చెక్కు మంజూరు
బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం
సీఎం తరపున చెక్కు అందజేసిన ఇన్ ఛార్జి కలెక్టర్
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాననన్న చంద్రబాబు
తల్లికి ఉపాధి కల్పిస్తామని భరోసా
తమ్ముడి చదువుకు అయ్యే ఖర్చుపైనా హామీ

అమరావతి, స్వేచ్ఛ: ప్రేమోన్మాది దాడిలో బలైన కడప జిల్లా ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మృతి చెందిన విద్యార్థిని తల్లితో ఫోన్ కాల్ చేసి చంద్రబాబు మాట్లాడారు. నిందితుడికి సాధ్యమైనంత తొందరలోనే కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు మృతురాలి తల్లికి ఉపాధి కూడా కల్పిస్తామని, ఆమె కొడుకు చదువు బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు కూడా జారీ చేశారు. విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన తనను ఎంతగానో బాధించిందని సీఎం అన్నారు. ఈ కేసులో నిందితుడికి మరణ శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారికి నిందిడుడికి పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలని అన్నారు.

ALSO READ : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? వైసీపీ.. టీడీపీ.. బిగ్ బ్రేకింగ్ సీక్రెట్ ఇదేనా ?

ఏం జరిగింది?

ఇంటర్ చదువుతున్న 16 సంవత్సరాల యువతికి స్థానిక హోటల్ లో వంటల చెఫ్ గా పనిచేస్తున్న విఘ్నేష్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ చిన్ననాటి నుంచీ స్నేహితులు. అయితే విఘ్నేస్ కు వివాహం అయింది. భార్య కూడా గర్భిణి. తనని ఆ రోజు అర్జెంటుగా కలవాలని స్నేహితురాలికి ఫోన్ చేశాడు. తాను రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా. వెంటనే ఆటోలో బయలుదేరిన స్నేహితురాలి ఆటోలో తాను కూడా మధ్యదారిలో ఎక్కాడు విఘ్నేష్. బద్వేల్ కు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ వద్దర ఇద్దరూ దిగి సమీపంలో దట్టంగా ఉన్న ముళ్ల పొదల కేసి వెళ్లారు. కొద్దిసేపటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను స్నేహితురాలిపై పోసి నిప్పంటించాడు విఘ్నేష్. అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఆ చుట్టుపక్కల కొందరు యువతి మంటలనార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు కడప పోలీసులు. ఎట్టకేలకు గాలించి నిందితుడు విఘ్నేస్ని అదుపులోకి తీసుకున్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×