E-Paper
Advertisement

Badvel girl murder : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు

Badvel girl murder : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు
Advertisement

Badvel girl murder :

బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం
రూ.10 లక్షల చెక్కు మంజూరు
బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం
సీఎం తరపున చెక్కు అందజేసిన ఇన్ ఛార్జి కలెక్టర్
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాననన్న చంద్రబాబు
తల్లికి ఉపాధి కల్పిస్తామని భరోసా
తమ్ముడి చదువుకు అయ్యే ఖర్చుపైనా హామీ

Advertisement

అమరావతి, స్వేచ్ఛ: ప్రేమోన్మాది దాడిలో బలైన కడప జిల్లా ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మృతి చెందిన విద్యార్థిని తల్లితో ఫోన్ కాల్ చేసి చంద్రబాబు మాట్లాడారు. నిందితుడికి సాధ్యమైనంత తొందరలోనే కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు మృతురాలి తల్లికి ఉపాధి కూడా కల్పిస్తామని, ఆమె కొడుకు చదువు బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు కూడా జారీ చేశారు. విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన తనను ఎంతగానో బాధించిందని సీఎం అన్నారు. ఈ కేసులో నిందితుడికి మరణ శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారికి నిందిడుడికి పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలని అన్నారు.

Advertisement

ALSO READ : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? వైసీపీ.. టీడీపీ.. బిగ్ బ్రేకింగ్ సీక్రెట్ ఇదేనా ?

ఏం జరిగింది?

ఇంటర్ చదువుతున్న 16 సంవత్సరాల యువతికి స్థానిక హోటల్ లో వంటల చెఫ్ గా పనిచేస్తున్న విఘ్నేష్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ చిన్ననాటి నుంచీ స్నేహితులు. అయితే విఘ్నేస్ కు వివాహం అయింది. భార్య కూడా గర్భిణి. తనని ఆ రోజు అర్జెంటుగా కలవాలని స్నేహితురాలికి ఫోన్ చేశాడు. తాను రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా. వెంటనే ఆటోలో బయలుదేరిన స్నేహితురాలి ఆటోలో తాను కూడా మధ్యదారిలో ఎక్కాడు విఘ్నేష్. బద్వేల్ కు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ వద్దర ఇద్దరూ దిగి సమీపంలో దట్టంగా ఉన్న ముళ్ల పొదల కేసి వెళ్లారు. కొద్దిసేపటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను స్నేహితురాలిపై పోసి నిప్పంటించాడు విఘ్నేష్. అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఆ చుట్టుపక్కల కొందరు యువతి మంటలనార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు కడప పోలీసులు. ఎట్టకేలకు గాలించి నిందితుడు విఘ్నేస్ని అదుపులోకి తీసుకున్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×