E-Paper
Advertisement

CM Chandrababu: ఖేలో ఇండియా నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి

CM Chandrababu: ఖేలో ఇండియా నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.

ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం..

అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవీయ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సమావేశంలో వివరించారు. ఇప్పటికే క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను పంపినట్టు చంద్రబాబు తెలిపారు.

ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలన్న సీఎం
అలాగే నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు సీఎం వెల్లడించారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.

శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలన్న చంద్రబాబు
జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని సీఎం పేర్కొన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించించారు.

Also Read: మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి కేసులో ఎన్ఆర్ఐ అరెస్ట్!

రూ.25 కోట్లు విడుదల చేయాలని వినతి
ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు కేంద్రమంత్రి మాండవీయకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×