E-Paper
Advertisement

CM Chandrababu: ఖేలో ఇండియా నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి

CM Chandrababu: ఖేలో ఇండియా నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి
Advertisement

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.

ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం..

Advertisement

అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవీయ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సమావేశంలో వివరించారు. ఇప్పటికే క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను పంపినట్టు చంద్రబాబు తెలిపారు.

ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలన్న సీఎం
అలాగే నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు సీఎం వెల్లడించారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.

Advertisement

శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలన్న చంద్రబాబు
జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని సీఎం పేర్కొన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించించారు.

Also Read: మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి కేసులో ఎన్ఆర్ఐ అరెస్ట్!

రూ.25 కోట్లు విడుదల చేయాలని వినతి
ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు కేంద్రమంత్రి మాండవీయకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×