E-Paper
Advertisement

AP Politics: బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్.. సభలో తాగి మాట్లాడడమేంటి? స్పీకర్‌కు బుద్ధి లేదు

AP Politics: బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్.. సభలో తాగి మాట్లాడడమేంటి? స్పీకర్‌కు బుద్ధి లేదు
Advertisement

AP Politics: టీడీడీ ఎమ్మెల్యే బాలకృష్ణపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. ఆయనకు కౌంటర్ ఇవ్వడమేకాదు.. పనిలోపనిగా స్పీకర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల కిందట అసెంబ్లీలో ఏం జరిగింది? అప్పుడు బాలకృష్ణ ఏమన్నారు? దానికి మాజీ సీఎం జగన్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం.

బాలకృష్ణపై మాజీ సీఎం రుసరుసలు

Advertisement

సరిగ్గా నెల రోజుల కిందట అంటే సెప్టెంబర్ 25న బాలకృష్ణ వ్యాఖ్యలకు ఏపీ అసెంబ్లీ వేదికైంది. వైసీపీ హయాంలో సినిమా పెద్దలను పిలిచి అవమానించారనే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఆయన్ని సైకోగా వర్ణించారు. ఆ మాటలకు చాలామంది షాకయ్యారు. తాజాగా ఆ ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు.

గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. అదే సమయంలో అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పవన్‌ మౌనంపై ఓ రిపోర్టర్ స్పందన అడిగారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది  ఏంటి? ప్రశ్నించారు మాజీ సీఎం.

Advertisement

స్పీకర్‌కు బుద్దిలేదన్న జగన్

పని పాటా లేని సంభాషణను బాలకృష్ణ తీసుకొచ్చారని, అసెంబ్లీలో తాగి మాట్లాడారని అన్నారు. తాగినవారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ప్రవర్తన ఎలా ఉందో ఆయన్ని ఆయన ప్రశ్నించుకోవాలన్నారు. తాగిన వ్యక్తి సభలో మాట్లాడనిస్తు న్నారంటే స్పీకర్‌కు బుద్ధి లేదన్నారు.  ఆ సమయంలో స్పీకర్ ఛైర్‌లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉన్నారు.

బాలకృష్ణపై జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ స్లోగన్‌ని గుర్తు చేస్తున్నారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ’ నినాదం ఆ పార్టీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.  అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశంపై సదరు ఎమ్మెల్యే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ని కోరారని గుర్తు చేస్తున్నారు.

ALSO READ:  ఆయనకు న సిగ్గు.. న లజ్జ, జగన్ ఘాటు వ్యాఖ్యలు

బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌పై జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.  అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఆయనంటే.. ఇప్పుడు జగన్ అన్నారని అంటున్నారు.  బాలకృష్ణ మాట్లాడిన సమయంలో స్పీకర్‌గా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉన్నారు. మరి జగన్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×