Ap News: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా, కృష్ణ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లు జలమయంగా మారాయి. దీంతో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్ల పై మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా స్కూల్లకీ, కాలేజిలకు సెలవు ప్రకటించారు. రాబోయే రెండు రోజులలో కూడా వర్షాలు ఉంటాయంటూ అధికారులు హెచ్చరించారు. మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా ఎల్లో అలర్ట్ జారీ చేసే సందర్భాలు నెలకున్నాయి. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.