E-Paper
Advertisement

CM Chandrababu: మూడు ముక్కలాట గేమ్ ఎండ్.. వైసీపీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: మూడు ముక్కలాట గేమ్ ఎండ్.. వైసీపీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement

CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. మూడు ముక్కలాట గేమ్‌కు ఎండ్ కార్టు పడిందన్నారు. బుధవారాన్ని చారిత్రాత్మక రోజుగా వర్ణించారు. రాజధానిని ఇంచ్ కూడా ఎవరూ కదిలించలేరని తేల్చేశారు.

ఏపీలో మూడు ముక్కలాట గేమ్ ఎండ్-సీఎం చంద్రబాబు

Advertisement

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. జగన్ లాంటి వ్యక్తిని తాను జీవితంలో చూడలేదన్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. వైసీపీది మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిందన్నారు.

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. ఇకపై అమరావతిని ఎవరూ ఇంచ్ కూడా కదలించలేరన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రమంతా విధ్వంసం అయ్యిందన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు రాలేదన్నారు. దాన్ని రాజకీయ పార్టీగా ఎలా ఊహిస్తారో తనకు అర్థం కాలేదన్నారు.

Advertisement

ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీపై సీఎం ఘాటు వ్యాఖ్యలు

ఆ పార్టీ పేరు చెప్పుకోవడానికి నేతలు సిగ్గుపడాలన్నారు. ఈ పార్టీ వల్ల రాష్ట్రానికి ఏమీ రాదన్నారు. ఇవాళ పార్లమెంటులో ఏపీ రాజధానిపై కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. రాజధానిని విధ్వంసం చేసి ఏడారి అని ఒకరు, శ్మశానం అని మరొకరు రకరకాలుగా మాటలు చెప్పారని గుర్తు చేశారు. చివరకు మనకు రాజధాని లేకుండా చేశారన్నారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయగిరికి రెండు ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం ఈ ప్రాంతానికి రెండు కంపెనీలు వచ్చినట్టు వివరించారు. ఒకప్పుడు ఉదయగిరిలో వ్యవసాయం చేయలేక వలస పోయేవారని వివరించారు.

ALSO READ: పార్టీనే సుప్రీం.. గీత దాటితే అంతే సంగతులు!

ఇటుక పేరు చెబితే ఉదయగిరి ప్రజలు గుర్తుకు వచ్చేవారని అన్నారు. ఉదయగిరి ప్రజల వద్ద డబ్బులు లేవని, ఇక్కడి నుంచి బయటకు వెళ్లినవారి దగ్గర డబ్బులే డబ్బులన్నారు. వెళ్లినవారు తిరిగి ఉదయగిరికి రావాలన్నారు.

 

 

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×