BigTV English
Advertisement

AP: ఏపీ ఘనతను గడగడా చెప్పేసిన సీఎం జగన్.. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ స్పెషల్..

AP: ఏపీ ఘనతను గడగడా చెప్పేసిన సీఎం జగన్.. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ స్పెషల్..

AP: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను అట్టహాసంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. 2 లక్షల కోట్ల పెట్టుబడులను టార్గెట్‌గా పెట్టుకుంది. సమ్మిట్ కోసం ఇప్పటికే 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. 35 మంది దేశీయ టాప్ ఇండస్ట్రియలిస్టులతో పాటు 25 దేశాలకు చెందిన దిగ్గజ వ్యాపారులు, హైకమిషనర్లు సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ముఖేష్ అంబానీ, అదానీ, ఆదిత్య బిర్లా, మిట్టల్ వంటి వారితో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలు కూడా విచ్చేయనున్నారు. విశాఖ జీఐఎస్‌ నేపథ్యంలో జాతీయ మీడియాకు సీఎం జగన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపీలో ఉన్న వనరులు, పెట్టుబడి మార్గాలు, అభివృద్ధి అంశాలపై విస్తృత సమాచారం అందించారు. సీఎం జగన్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే….


–ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం. 6 పోర్టులు, కొత్తగా ఏర్పాటవుతున్న మరో 4 పోర్టులు. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలం.

–దేశంలో 11 పారిశ్రామిక కారిడార్‌లు వస్తుంటే.. అందులో 3 ఏపీకే. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే.


–రాష్ట్రంలో 48 రకాల ఖనిజాలు లభ్యత.. సిమెంట్, లైమ్‌స్టోన్‌ పరిశ్రమలకు అనుకూలం.

–రెన్యువబుల్, గ్రీన్‌ ఎనర్జీకి ఏపీలో పుష్కలమైన వనరులు. విండ్, హైడ్రోజన్, సోలార్‌ విద్యుదుత్పత్తికి అపార అవకాశాలు. 82 గిగావాట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ కెపాసిటీ, 34 గిగావాట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు అవకాశం.

–2021–22లో 11.43 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నెంబర్‌ వన్.

–ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక చర్యలు. ‘నాడు–నేడు’, ‘అమ్మ ఒడి’.. ఓ విప్లవం.

–ఆరో తరగతి నుంచి డిజిటల్‌ తరగతులు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు.

–ఏపీలో అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథకాలు కాదు.. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావి­స్తున్నాం.

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×