E-Paper
Advertisement

YS Jagan : సీఎం జగన్ నర్సాపురం టూర్.. టీడీపీనే టార్గెట్

YS Jagan : సీఎం జగన్ నర్సాపురం టూర్.. టీడీపీనే టార్గెట్
Advertisement

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం బహిరంగ సభ వేదికపై టీడీపీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా పేర్కొన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని వివరించారు. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీనే గెలిపించారని గుర్తు చేశారు. టీడీపీ పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకున్నారని జగన్ అన్నారు. అందుకే 2019లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్‌, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. నర్సాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. నర్సాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు.

Advertisement

గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారులకు సీఎం జగన్‌ అండగా నిలిచారని అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించారని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×