E-Paper
Advertisement

Cold Weather: వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Cold Weather: వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Advertisement

Cold Weather: తెలుగు రాష్ట్రాలను చ‌లి వ‌ణికిస్తోంది. ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో నిన్న అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అదే విధంగా ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో 8.3, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా 7.8 నుంచి 13.9 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. నవంబర్‌ నెలలో 2016లో మోమిన్‌పేటలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మళ్లీ ఇప్పుడు కోహిర్‌లో నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు 4-6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: మోడీ మానియా.. బీహార్‌లో NDA ప్రభంజనం

Advertisement

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. అల్లూరి జిల్లాలోని ప్రాంతాలు ముఖ్యంగా అరకు లోయలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. జీ. మాడుగులలో ఆరు డిగ్రీలు, అరకులో 7.3 డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పదికి పైగా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ, ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి చలిగాలుల కారణంగా రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×