BigTV English
Advertisement

Vallabhaneni Vamsi : వంశీకి వైద్య పరీక్షలు పూర్తి – ఏ క్షణమైనా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు

Vallabhaneni Vamsi : వంశీకి వైద్య పరీక్షలు పూర్తి – ఏ క్షణమైనా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు

Vallabhaneni Vamsi : వైసీపీ  అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులు హైదరాబాద్ లో వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపిన కృష్ణలంక పోలీసుల.. రాత్రి 10 గంటల ప్రాంతంలో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు జరిపించారు. వైద్య పరీక్షల్లో అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తేలడంతో..  రిమాండ్ కోరుతూ న్యాయమూర్తి ఎదుట వంశీని తరలిస్తున్నారు.


ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా శివరామ కృష్ణప్రసాద్ లను చేర్చారు. ఏ8గా నిమ్మ లక్ష్మీపతి లను రిమాండ్ రిపోర్టులో చేర్చారు.

దీంతో.. ఈ కేసులో వల్లభనేని వంశీ జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే.. అతనికి న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వంశీని విచారణ కోసం హైదరాబాద్ నుంచి తీసుకువచ్చినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్న సమయంలోనూ  వందల మంది పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పోలీసుల వాహనాలకు అడ్డుగా వచ్చి ఆందోళనలు చేపట్టారు.


గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. టీడీపీ ఆఫీసు మీద దాడి కేసుతో పాటు.. ఆ ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేశారనే కేసులు బనాయించారు. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సమయంలో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 140(1), 308, 351(3) రెడ్‌విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదైంది.  అతను కిడ్నాప్ చేసింది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే.. ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Related News

Pothuluri Veera Brahmendra Swamy: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 400 ఏళ్ల నాటి ఇల్లు, అరిష్టం తప్పదా?

CM Chandrababu: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు? ఉదయం నుంచి రాత్రి వరకు సమీక్షలు

Cyclone Montha Impact: తుఫాన్ ప్రభావిత జిల్లాలపై పవన్ ఫోకస్.. నష్టంపై వివరాలు సేకరణ, పునరుద్దరణ చర్యలు చేపట్టాలని ఆదేశం

Montha Disaster in AP: ఏపీలో మొంథా బీభత్సం.. విశాఖ-అరకు రైల్వే ట్రాక్ ధ్వంసం, చెట్లు-విద్యుత్ స్తంభాలు

Cyclone Montha Update: మొంథా తుఫాను తీరం దాటింది..శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు

Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్

Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Big Stories

×