E-Paper
Advertisement

Montha Disaster in AP: ఏపీలో మొంథా బీభత్సం.. విశాఖ-అరకు రైల్వే ట్రాక్ ధ్వంసం, చెట్లు-విద్యుత్ స్తంభాలు

Montha Disaster in AP: ఏపీలో మొంథా బీభత్సం.. విశాఖ-అరకు రైల్వే ట్రాక్ ధ్వంసం, చెట్లు-విద్యుత్ స్తంభాలు

Montha Disaster in AP: ఆంధ్రప్రదేశ్‌‌లోని మొంథా తుఫాను బీభత్సానికి చిరుగుటాకులా వణికించింది. ఆదివారం అర్థరాత్రి నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం మొదలు నెల్లూరు వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ధాటికి వివిధ జిల్లాల్లో  అర్బన్ ఏరియాల్లో చెట్లు విరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాల గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికక్కడే నేల కూలాయి. ఈ పరిస్థితిని ముందుగా ఊహించిన అధికారులు విద్యుత్‌ సరఫరాను పలు ప్రాంతాలకు నిలిపివేశారు.

కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాను బీభత్సం

మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు, గాలులు ఏపీని వెంటాడుతున్నాయి. తుపాను తీరం ధాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. దీని ధాటికి తీర ప్రాంతంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఏడు జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో కూలి పోయాయి.

గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోయాయి. కృష్ణా జిల్లా తీరంలో అంధకారం అలుముకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకారం, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తాయని హెచ్చరిక జారీచేసింది వాతావరణ శాఖ. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

చెట్లు, విద్యుత్ స్థంబాలు.. రైల్వే ట్రాక్ ధ్వంసం

మొంథా తుఫాను ధాటికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది.  శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాజెక్టులు నీటి ప్రవాహం అమాంతంగా పెరిగింది.  ఒడిషా నుంచి వస్తున్న వరదతో మహేంద్ర తనయ, వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా గురించి చెప్పనక్కర్లేదు.

ALSO READ:  మొంథా తుఫాను తీరం ధాటింది.. కుమ్మేస్తున్న వర్షాలు

ఉమ్మడి విశాఖ, పాడేరు, అరకు ఘాట్‌రోడ్‌పై వరద నీరు ఏరులై పారింది. అనంతగిరి సమీపంలో రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహించింది. దీంతో ఆయా ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖ నుండి అరకు వెళ్లే సింగిల్ రైలు మార్గంలో వర్షం బీభత్సం అంతా ఇంతా కాదు. త్యాడ, చిమిడిపల్లి రైల్వే‌స్టేషన్ లైన్ సెక్షన్ మధ్య సొరంగం దగ్గర ట్రాక్‌పై బండరాళ్లు పడిపోయాయి. 63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. సమీపంలో ఉన్న అధికారులు, ట్రాక్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.  చాలా ప్రాంతాల్లో సమద్రం కోతకు గురైంది.

కృష్ణా, గుంటూరు, ప్రకారం జిల్లాల్లో తుఫాను వల్ల భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  కోస్తా జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నారు. వరితోపాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.  నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కోనసీమ జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెంలో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద మత్య్సకారుడు సముద్రంలో గల్లంతు అయ్యాడు. బోటును ఒడ్డుకు చేర్చే క్రమంలో సముద్రంలోకి జారిపోయాడు సాయిరామ్ అనే వ్యక్తి.  చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక విరిగిపోయిన చెట్లు గురించి చెప్పనక్కర్లేదు. ఒంగోలు పట్టణంలో ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు ప్రవహిస్తోంది వరద నీరు. ఆ జిల్లా వ్యాప్తంగా 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.  దాదాపు 3 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.

 

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×