E-Paper
Advertisement

Cyclone Ditwah: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. విద్యార్థులకు అలెర్ట్, ఇవాళ ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

Cyclone Ditwah: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. విద్యార్థులకు అలెర్ట్, ఇవాళ ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

Cyclone Ditwah:  రెండు రోజులుగా తీరప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తోంది దిత్వా తుఫాను. ఆదివారం సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలహీన పడి, సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని కారణంగా ఏపీపై భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తుఫాను నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. విద్యార్థులకు అలెర్ట్

దిత్వా తుఫాన్‌ దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తోంది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి వాతావరణంలో పలుమార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణంగా నెల్లూరు జిల్లాలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

దిత్వా తుఫాన్ కారణంగా ఏపీ ప్రభుత్వం యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు హోంమంత్రి అనిత.  నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు నేడు సెలవు

క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు ఆ జిల్లాల మంత్రులు నారాయణ, ఆనంలు వరదలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

నెల్లూరు, సర్వేపల్లి, కోవూరు ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఆ జిల్లాలో జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారాయి. కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  తుఫాను కారణంగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

ALSO READ: కృష్ణాలో పునర్విభజన వివాదం

చిరు జల్లులతో మొదలైన వర్షం.. భారీగా వర్షం పడుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లాలోని చీరాట, వేటపాలెం బీచ్ లను మంగళవారం వరకు మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు కోనసీమ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు పడ్డాయి.

వర్షానికి ఈదురుగాలులు తోడు కావడంతో పంటలు దెబ్బతిన్నాయి. అటు కోస్తాంధ్రాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం వరకు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు క‌డ‌ప‌, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×