E-Paper
Advertisement

Cyclone Michaung Effect: అల్లకల్లోలం సృష్టిస్తోన్న మిగ్ జాం.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Michaung Effect: అల్లకల్లోలం సృష్టిస్తోన్న మిగ్ జాం.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement

Cyclone Michaung Effect: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాను ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 170 కిలోమీటర్లు, నెల్లూరుకు 20 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.

మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల వద్ద తీవ్ర తుఫానుగా మారి, తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బుధవారం రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

michaung latest update
michaung latest update
Advertisement

తుఫాను ప్రభావంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కడప, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఏపీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

తుపాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. కొత్తపట్నం, సింగరాయకొండ , టంగుటూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రెడ్ అలర్ట్ మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్తపట్నం ప్రాంతంలో సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్గ్ వర్షాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాను సేఫ్టీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×