BigTV English

Cyclone Michaung Effect: అల్లకల్లోలం సృష్టిస్తోన్న మిగ్ జాం.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Michaung Effect: అల్లకల్లోలం సృష్టిస్తోన్న మిగ్ జాం.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Michaung Effect: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాను ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 170 కిలోమీటర్లు, నెల్లూరుకు 20 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.


మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల వద్ద తీవ్ర తుఫానుగా మారి, తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బుధవారం రాయలసీమ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

michaung latest update
michaung latest update

తుఫాను ప్రభావంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కడప, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఏపీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.


తుపాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. కొత్తపట్నం, సింగరాయకొండ , టంగుటూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రెడ్ అలర్ట్ మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్తపట్నం ప్రాంతంలో సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్గ్ వర్షాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాను సేఫ్టీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related News

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

Big Stories

×