BigTV English

Cyclone michaung update :తుపాన్ బీభత్సం.. చెన్నైకి ఆగిపోయిన రాకపోకలు

Cyclone michaung update :తుపాన్ బీభత్సం.. చెన్నైకి ఆగిపోయిన రాకపోకలు

Cyclone Michaung Update : నెల్లూరు జిల్లా మైపాడు, రామతీర్థం మధ్య ముత్తుకూరు వద్ద సోమవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుంటటంతో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో గత రాత్రి నుండి జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక చోట్ల మొబైల్ నెట్ వర్క్స్ ఆగిపోయాయి. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలో కాలంగి ఉధృతికి జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరుకుంది. దాంతో నెల్లూరు నుంచి చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి.


భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో తీవ్ర స్థాయిలో వర్షపునీరు నిలిచిపోవటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరడంతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రస్తుతం కావలి ఉప్పరపాలెం వద్ద మిచౌంగ్ తుపాన్ అల్పపీడనంగా బలహీనపడి కొనసాగుతుంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుడండతో సముద్రం ముందుకు వచ్చింది. తుపాను తీరందాటినా.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

.


.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×