E-Paper
Advertisement

Cyclone michaung update :తుపాన్ బీభత్సం.. చెన్నైకి ఆగిపోయిన రాకపోకలు

Cyclone michaung update :తుపాన్ బీభత్సం.. చెన్నైకి ఆగిపోయిన రాకపోకలు
Advertisement

Cyclone Michaung Update : నెల్లూరు జిల్లా మైపాడు, రామతీర్థం మధ్య ముత్తుకూరు వద్ద సోమవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుంటటంతో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో గత రాత్రి నుండి జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక చోట్ల మొబైల్ నెట్ వర్క్స్ ఆగిపోయాయి. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలో కాలంగి ఉధృతికి జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరుకుంది. దాంతో నెల్లూరు నుంచి చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో తీవ్ర స్థాయిలో వర్షపునీరు నిలిచిపోవటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరడంతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రస్తుతం కావలి ఉప్పరపాలెం వద్ద మిచౌంగ్ తుపాన్ అల్పపీడనంగా బలహీనపడి కొనసాగుతుంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుడండతో సముద్రం ముందుకు వచ్చింది. తుపాను తీరందాటినా.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Advertisement

.

.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×