Doctor Family Died in Vijayawada : విజయవాడ నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒక డాక్టర్ ఫ్యామిలీ మొత్తం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. శ్రీజ హాస్పిటల్స్ ఎండీ.. డాక్టర్ శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్. శ్రీనివాస్ (40) ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు.
ఆయన భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65) లను పీకకోసి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నలుగురినీ హత్య చేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడా ? లేక వేరెవరైనా కుటుంబం మొత్తాన్నీ చంపారా ? సూసైడ్ అయితే.. శ్రీనివాస్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ ఆస్పత్రి యజమాని అయిన శ్రీనివాస్.. అప్పుల వల్ల ఆస్పత్రిని ట్రస్ట్ ఆస్పత్రికి లీజుకిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆస్పత్రి పెట్టిన ఆయన.. నష్టాలు రావడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.