E-Paper
Advertisement

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!
Advertisement

YSRCP latest news(AP political news) : తమ పార్టీకి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తమకు తెలియజేసిందని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయలేదు.

Advertisement

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖకు కేంద్రం ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. వైసీపీ ఇచ్చిన సమాచారాన్ని లేఖ ద్వారా రఘురామకృష్ణరాజుకు పంపింది. అలాగే పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్ఆర్ సీపీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×