BigTV English

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!


YSRCP latest news(AP political news) : తమ పార్టీకి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తమకు తెలియజేసిందని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయలేదు.

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖకు కేంద్రం ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. వైసీపీ ఇచ్చిన సమాచారాన్ని లేఖ ద్వారా రఘురామకృష్ణరాజుకు పంపింది. అలాగే పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్ఆర్ సీపీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×