E-Paper
Advertisement

Godavari : గోదావరి ఉగ్రరూపం.. ముంపులో లంక గ్రామాలు..

Godavari : గోదావరి ఉగ్రరూపం.. ముంపులో లంక గ్రామాలు..
Advertisement

Godavari : గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. అయితే భద్రాచలం వద్ద గోదారమ్మ కాస్త శాంతించింది. నీటిమట్టం 52.60 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. అయితే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. అక్కడ నీటిమట్టం 15.50 అడుగులుగా ఉంది.

వరద ప్రభావంతో కోనసీమ జిల్లాలోని 25 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో లంకగ్రామాల వాసులు నాటు, మర పడవల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. పి.గన్నవరం మండలంలోని జొన్నలంక, కె.ఏనుగుపల్లి లంక, శివాయలంకలో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. యానాం బాలయోగి వారధి వద్ద వరద ప్రవాహం పెరిగింది.

Advertisement

ఐ.పోలవరం మండలంలోని కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. పాత ఇంజరం వద్ద స్లూయిజ్‌ లీక్‌ తో గ్రామంలోకి వరద వచ్చి చేరింది. దీంతో పంటలు నీట మునిగాయి. మురవళ్ల రాఘవేంద్ర వారధి వద్ద ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, ఆచంట మండలాల్లోని 16 లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే నీట మునిగింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి, శబరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంత చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లోని 115 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 5 రోజులుగా ఏపీ, తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

చట్టి, సింగన్నగూడెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి.. చింతూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే హైవేపై నిమ్మలగూడెం, కుయ్యుగూరు మధ్య వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వరరామచంద్రాపురం మండలాల మధ్య శబరి నదిపై ఉన్న వంతెన మునిగిపోయింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి 20 వేల మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×