E-Paper
Advertisement

Election Commissioner : ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు.. 22న తుది జాబితా విడుదల..

Election Commissioner : రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయనన్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయన్నారు.

Election Commissioner : ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు.. 22న తుది జాబితా విడుదల..

Election Commissioner : రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయనన్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయన్నారు.

పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించామన్నారు. మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు. వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభ పరిణామమని తెలిపారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందని ఈసీ తెలిపారు. తొలిసారిగా 7.88లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. వందేళ్లు దాటిన వృద్ధులు 1,174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న తుది జాబితా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×