E-Paper
Advertisement

Simultaneous Polls : జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణ.. ప్రజల నుంచి ఐదు వేల సూచనలు..

Simultaneous Polls : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా సూచనలు అందాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది.

Simultaneous Polls : జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణ.. ప్రజల నుంచి ఐదు వేల సూచనలు..

Simultaneous Polls : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా సూచనలు అందాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది.

ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను కమిటీ ఆహ్వానించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచనలను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో తగిన మార్పులను సూచించాలని కోవింద్‌ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదా sc-hlc@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయాలని తెలియజేసింది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం 2023 సెప్టెంబర్ లో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలను నిర్వహించింది. ఇటీవల కమిటీ ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×