E-Paper
Advertisement

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..
Advertisement

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీకోట మండలం పలమనేరులో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, గోనుమాకులపల్లి, తెట్టుబండపల్లి గ్రామాలలో 13 ఏనుగులు పంటలపై స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎప్పుడు.. ఎటువైపు నుంచి.. వచ్చి ఏనుగులు దాడి చేస్తాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏమి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఏనుగుల దాడిలో లక్షల్లో పంటలను నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. ఇప్పటి వరకు పంటలను మాత్రమే నాశనం చేసిన ఏనుగులు.. ప్రజలపై దాడి చేయకముందే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×