E-Paper
Advertisement

Elephants kills oldman: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

Elephants kills oldman: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి
Advertisement

Elephants kills oldman in Manyam: ఏపీలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవి దాడి చేయడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటి నుంచి తమను రక్షించాలంటూ వారు వేడుకుంటున్నారు. ఏపీలోని మన్యం జిల్లా కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలపై పడి వాటిని పాడు చేస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా అవి దాడి చేస్తున్నాయి. ఓ వృద్ధుడిపై అవి దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా అవి దాడి చేశాయి.

Also Read: తిరుపతికి వెళ్తున్నారా ? టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

Advertisement

అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతను గమనించలేకపోయాడు. దారిలో వెళ్తుండగా ఏనుగులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అయితే, ఇటీవలే కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×