E-Paper
Advertisement

Elephants kills oldman: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

Elephants kills oldman: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

Elephants kills oldman in Manyam: ఏపీలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవి దాడి చేయడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటి నుంచి తమను రక్షించాలంటూ వారు వేడుకుంటున్నారు. ఏపీలోని మన్యం జిల్లా కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలపై పడి వాటిని పాడు చేస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా అవి దాడి చేస్తున్నాయి. ఓ వృద్ధుడిపై అవి దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా అవి దాడి చేశాయి.

Also Read: తిరుపతికి వెళ్తున్నారా ? టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతను గమనించలేకపోయాడు. దారిలో వెళ్తుండగా ఏనుగులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అయితే, ఇటీవలే కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరుచూ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×