E-Paper
Advertisement

Tirupati: తిరుపతికి వెళ్తున్నారా ? టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

Tirupati: తిరుపతికి వెళ్తున్నారా ? టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Advertisement

Tirupati: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాధి మంది భక్తులు ఆలయానికి వెళ్తారు. ప్రతి రోజు దేశ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సాధారణంగా తిరుమలు వచ్చే భక్తులు ముందుగానే అధికారిక వెబ్ సైట్‌లో టికెట్‌లను బుక్ చేసుకుంటారు. కానీ కొందరు మధ్య వర్తుల ద్వారా టికెట్లు బెక్ చేసుకుంటుండంతో టీటీడీ ,భక్తులకు కొన్ని సూచనలు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు తమ ఆధార్ నెంబర్‌తో పాటు చిరునామా సహాయంతో టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. అంతే కాకుండా మధ్యవర్తులను ఆశ్రయించి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవద్దని కోరింది.

శ్రీ వారి కళ్యాణోత్సవం కోసం ఆగస్టు 22 వ తేదీ గురువారం తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు ఉదయం వైకుఠంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. టీటీడీ అధికారులు వారిని గుర్తించి విచారించగా తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహించే వ్యక్తి పాస్ పోర్టు చివరి నెంబర్‌లను మార్చి ఆన్ లైన్‌లో కళ్యాణోత్సవం టికెట్లను బుక్ చేసి పెద్ద మొత్తంలో అమ్మినట్లు తెలిసింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Also Read: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు

ముఖ్యంగా దర్శనం కోసం టికెట్ల బుకింగ్‌ కోసం కొందరు దళారులు భక్తులు నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. మధ్య దళారులను తొలగించేందుకు టీటీడీ యాజమాన్యం నిర్విరామంగా కృషి చేస్తోంది. దర్శనం కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులు పడకూడదని టీటీడీ వెల్లడించింది. సాధారణంగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తారు. ఒక వేళ భక్తులు బుక్ చేసుకున్న టికెట్లు నకిలీవని తేలితే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దర్శన టికెట్లు, సేవా టికెట్లు వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు.

Advertisement

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×