E-Paper
Advertisement

దుర్గమ్మ సన్నిధిలో భారీ మోసం.. నకిలీ పత్రాలతో అర్చకుడి అవతారం!

దుర్గమ్మ సన్నిధిలో భారీ మోసం.. నకిలీ పత్రాలతో అర్చకుడి అవతారం!
Advertisement

Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయం పవిత్రతకు మారుపేరు. కానీ, అదే ఆలయంలోకి అక్రమ మార్గంలో ప్రవేశించేందుకు ఒక వ్యక్తి వేసిన ఎత్తుగడ ఇప్పుడు సంచలనంగా మారింది. మరణించిన ఒక అర్చకుడి స్థానాన్ని చేజిక్కించుకోవడానికి, నకిలీ పత్రాలను సృష్టించి అధికారులనే బురిడీ కొట్టించాలని చూడటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆలయ భద్రత మరియు రికార్డుల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాయి బాబు మరణం.. దిలీప్ ‘స్కెచ్’!
అసలు విషయం ఏమిటంటే, 2022లో దుర్గగుడిలో విధులు నిర్వహిస్తున్న సాయి బాబు అనే అర్చకుడు మరణించారు. సాధారణంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం, సర్వీసులో ఉన్న వ్యక్తి మరణిస్తే వారి వారసులకు ఆ అవకాశం దక్కుతుంది. ఇదే అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దిలీప్ అనే వ్యక్తి, ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకోవాలని పథకం వేశాడు. సాయి బాబుకు తనే వారసుడినంటూ నకిలీ పత్రాలను సిద్ధం చేసి రంగంలోకి దిగాడు.

Advertisement

అధికారుల కళ్లుగప్పి అడుగుపెట్టే ప్రయత్నం
దిలీప్ కేవలం మాటలతో సరిపెట్టకుండా, దేవాదాయ శాఖను నమ్మించేందుకు ప్రభుత్వ ముద్రలు కలిగిన నకిలీ సర్టిఫికెట్లను, డాక్యుమెంట్లను సృష్టించాడు. ఈ పత్రాలను అధికారులకు సమర్పించి, వారసత్వ కోటాలో అర్చకత్వం పొందేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. అయితే, వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నిశితంగా పరిశీలించగా, ఆ పత్రాల్లో పొంతన లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అధికారులు షాక్‌కు గురయ్యారు.

దేవాదాయ శాఖ వెరిఫికేషన్‌పై విమర్శల జడివాన
ఇంతటి సున్నితమైన అంశంలో ఒక వ్యక్తి ధైర్యంగా నకిలీ పత్రాలు సృష్టించగలిగాడంటే, వ్యవస్థలో లోపాలు ఎక్కడ ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇలాగే ఎంతమంది నకిలీ పత్రాలతో విధుల్లో చేరారో అన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఇంత బలహీనంగా ఉందా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ప్రతిష్టను మసకబార్చే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026: బాలికలదే పైచేయి, ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత

కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్న భక్తులు
అమ్మవారి సన్నిధిలో అపవిత్ర పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దిలీప్ అనే వ్యక్తి వెనుక ఎవరైనా ఆలయ సిబ్బంది సహకారం ఉందా? లేక ఇదంతా తనే స్వయంగా చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు తావులేకుండా, డిజిటల్ విధానంలో పక్కాగా రికార్డులను తనిఖీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ‘నకిలీ అర్చకుడి’ ఉదంతం బెజవాడలో హాట్ టాపిక్ అయింది.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×