E-Paper
Advertisement

Srikalahasti: శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి ఫైటింగ్..కత్తులు, కర్రలతో దాడులు, ఏం జరిగింది?

Srikalahasti: శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి ఫైటింగ్..కత్తులు, కర్రలతో దాడులు, ఏం జరిగింది?
Advertisement

Srikalahasti: శ్రీకాళహస్తిలో అర్థరాత్రి దాదాపు అరగంటపాటు రణరంగం చోటు చేసుకుంది.  రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఇరువర్గాల వారు దాదాపు అరగంటపాటు ఇరువర్గాలు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్ల దాడి చేసుకున్నారు.  ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

శ్రీకాళహస్తి పట్టణంలో ద్రౌపది సమేత ధర్మరాజులస్వామి అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమం జరిగింది. కార్యక్రమం తర్వాత మంచినీళ్ల గుంటకు చెందిన రోహిత్,ధనుష్- వీఎంపల్లికి చెందిన భానుకిరణ, చరణ్‌ల ఆదివారం రాత్రి మద్యం మత్తులో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రెండు గ్రూపుల మధ్య తీవ్రరూపం దాల్చింది.

Advertisement

తొట్టంబేడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ద్విచక్ర వాహనంలో వస్తున్న రోహిత్ , ధనుష్‌లను అడ్డుకుని భాను,చరణ్,కిరణ్‌లు దాడి చేశారు. ఈ ఘటనలో రోహిత్, ధనుష్‌లకు గాయాలు అయ్యాయి. గాయపడినవారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు వారి స్నేహితులు సుధాకర్, మునిరత్నం, ముని రాజాలు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిపై మరొకసారి దాడి చేసేందుకు కొందరి యువకులతో కలసి భాను,కిరణ్,చరణ్ వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టుకున్నారు ఇరువర్గాల వారు. దాదాపు గంట పాటు ఆసుపత్రి ఆవరణం రణరంగంగా మారిపోయింది. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

ALSO READ: శ్రీశైలంలో సీఎం చంద్రబాబు.. జలహారతి తర్వాత గేట్లు ఓపెన్

ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడ చూసినా రక్తపు మరకలు కనిపించాయి. దాడి ఘటనతో భయపడి ఆసుపత్రి నుంచి రోగులు, నర్సులు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసుకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈలోగా ఓ వర్గం అక్కడి నుంచి పరారు అయ్యారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. దాడికి సంబంధించి ఆసుపత్రి బయట సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాడి ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు డీఎస్పీ నరసింహమూర్తి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి.

 

Related News

మాజీ స్పీకర్ తమ్మినేని చుట్టూ ఉచ్చు.. సీతారాం, కుటుంబసభ్యులపై కేసు, ఏం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×