Coimbatore Crime: తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్పోర్టు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కళాశాల విద్యార్థినిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది. నర్సింగ్ చదువుతున్న యువతి తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ముగ్గురు ఆగంతకులు అడ్డుపడి కార్లో యువతిని కిడ్నాప్ చేశారు. కార్లో ఉన్న స్నేహితుడు అడ్డు పడినప్పటికీ అతని పై దాడి చేశారు. అనంతరం అక్కడి నుండి తీసుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు అక్కడి నుండి పరార్ అయ్యే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం బాధితురాలిని, నిందితులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.