E-Paper
Advertisement

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన
Advertisement

Anakapalli: బస్సు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని భావించిన సమయంలో.. అగ్నిప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా గురువారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులోని 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

అనకాపల్లి జిల్లాలో ఘటన..  మంటల్లో ట్రావెల్ బస్సు

Advertisement

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తోంది శ్రీ తులసి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో రేగుపాలెం సమీపంలోకి బస్సు వచ్చేసరికి ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, బస్సు ఆపి ప్రయాణికులకు సూచన చేశాడు. వెంటనే ప్రయాణికులంతా వేగంగా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం కాలిపోయింది. ఘటనలో సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

అప్రమత్తమైన డ్రైవర్..  35 మంది ప్రయాణికులు సేఫ్

బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎలమంచిలి అగ్నిమాపక అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు ఇంజన్‌లో డీజిల్ లీక్ కావడం వల్ల ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది మాట.

ఘటన సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత బస్సును పక్కకు తొలగించారు పోలీసులు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదం నుంచి అందరూ బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.  సంబంధిత ట్రావెల్ సంస్థ  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేసింది.

ALSO READ: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

 

Related News

వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

ఢిల్లీ పార్లమెంట్‌లో భోగాపురం రచ్చ.. సీఎం చంద్రబాబుకు మంత్రి తనూజ రాణి సవాల్!

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!

మెగా డీఎస్సీ వ్యవహారం.. హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, సీబీఐ విచారణకు నిరాకరణ

నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్‌ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్‌చల్!

ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి.. జైలుకెళ్లడానికైనా సిద్ధమే- అంబటి రాంబాబు

నత్తనడక పనులకు చెక్.. అధికారులకు పవన్ కళ్యాణ్ క్లియర్ డెడ్‌లైన్!

Big Stories

Advertisement
×