E-Paper
Advertisement

RTC Bus Accident in Kakinada: కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం!

RTC Bus Accident in Kakinada: కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం!

Road Accident In Kakinada

Road Accident In Kakinada: కాకినాడ, పత్తిపాడు హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివారల ప్రకారం.. పత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద నేషనల్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయింది.

రహదారి పక్కనే లారీని నిలిపివేసి ముగ్గురూ కలిసి టైరు మార్చే పనిలో పడ్డారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మరమ్మతులు చేస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి.. అక్కడిక్కడే చనిపోయారు.

Read More: వారం వారం సర్వే.. తేడా వస్తే అభ్యర్థులను మార్చేస్తా.. చంద్రబాబు వార్నింగ్..

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పత్తిపాడు సీఐ శేఖర్ బాబు, ఎస్సై పవన్ కుమార్ మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×