Bhagya Shri Borse: సౌత్ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా భాగ్యశ్రీ (Bhagya Shri)ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతూ, మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీ బిజీగా ఉంటున్నారు. భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన కాంతా, ఆంధ్రకింగ్ తాలుక సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇదే నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో భాగ్యశ్రీ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె హీరో రామ్ పోతినేని(Ram Pothineni) తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు భాగ్యశ్రీ సమాధానం చెబుతూ ఇప్పటి వరకైతే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మంచి మనసు ఉన్న వ్యక్తి అయితే చాలు. అలాగే నాకు కాబోయే వ్యక్తి హోప్ లెస్ రొమాంటిక్ అయి ఉండాలి అంటూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా భాగ్యశ్రీ తనుకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పడంతో వెంటనే అభిమానులు మరి ఈ క్వాలిటీ రామ్ లో ఉన్నాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా రామ్, భాగ్యశ్రీ రిలేషన్ లో ఉన్నారు అంటూ వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు దీంతో ఈ వార్తలు నిజమేనని ఈ జంట కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ అభిమానులు భావిస్తున్నారు.
ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర..
ఇదే ప్రశ్న యాంకర్ రామ్ పోతినేని కూడా ప్రశ్నించారు మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడగడంతో ఇప్పటివరకైతే ఏం ఆలోచించలేదని తెలిపారు. అంతటితో ఆగకుండా మీరు చెప్పండి రామ్ కి ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది అంటూ భాగ్యశ్రీను అడగడంతో వెంటనే రామ్ ఫాన్స్ ను వాడుకొని ఇక మీరు అన్ని కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారా అంటూ మాట్లాడారు. ఇలా వీరిద్దరూ వారి కాబోయే జీవిత భాగస్వాముల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఆంధ్ర కింగ్ సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో నటుడు ఉపేంద్ర నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలు పెంచేయడమే కాకుండా ఈసారి రామ్ మంచి హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది.