E-Paper
Advertisement

Krishna District: నమ్మకానికి ‘కన్నం’.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్!

Krishna District: నమ్మకానికి ‘కన్నం’.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్!
Advertisement

Krishna District: ప్రస్తుత కాలంలో సామాన్యుడికి భద్రత అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. బయట అడుగుపెడితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంట్లో నగదు, బంగారం ఉంచుకుంటే దొంగల భయం. అలా కాదు అని ప్రజలు తమ కష్టార్జితాన్ని అత్యంత సురక్షితం అని భావించి బ్యాంక్ లాకర్లలో దాచుకుంటున్నారు. కానీ..’కంచే చేను మేసినట్లు‘ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బ్యాంకుల్లోనే నేడు అక్రమాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నమ్మకానికి మారుపేరుగా నిలవాల్సిన బ్యాంక్ సిబ్బందే నగల మాయం వెనుక ఉండటం లేదా పర్యవేక్షణ లోపంతో విలువైన సొత్తు గల్లంతవ్వడం సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడ అలాంటి ఘటనే కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. 

Advertisement

కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్‌లో చనిపోయిన వ్యక్తి బంగారాన్ని మాజీ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి కాజేసేంది. బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్ర బాబు గతంలో తాకట్టు పెట్టిన బంగారం కోసం ఆయన కుటుంబ సభ్యులు బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ  నామినీగా మాజీ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి అవాక్కయ్యారు.

ఎటువంటి సంబంధం లేని ప్రభావతికి నాగేంద్ర బాబు డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయిందని..  ఆమె ఆ సర్టిఫికెట్‌తో బంగారం విడిపించుకునేందుకు వస్తే.. బ్యాంక్ అధికారులు ఎలా ఇచ్చారని బాధితులు నిలదీశారు. గతంలోనూ పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ప్రభావతి జైలుకి వెళ్లి వచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి..  తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ:సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×