Krishna District: ప్రస్తుత కాలంలో సామాన్యుడికి భద్రత అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. బయట అడుగుపెడితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంట్లో నగదు, బంగారం ఉంచుకుంటే దొంగల భయం. అలా కాదు అని ప్రజలు తమ కష్టార్జితాన్ని అత్యంత సురక్షితం అని భావించి బ్యాంక్ లాకర్లలో దాచుకుంటున్నారు. కానీ..’కంచే చేను మేసినట్లు‘ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బ్యాంకుల్లోనే నేడు అక్రమాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నమ్మకానికి మారుపేరుగా నిలవాల్సిన బ్యాంక్ సిబ్బందే నగల మాయం వెనుక ఉండటం లేదా పర్యవేక్షణ లోపంతో విలువైన సొత్తు గల్లంతవ్వడం సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడ అలాంటి ఘటనే కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్లో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్లో చనిపోయిన వ్యక్తి బంగారాన్ని మాజీ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి కాజేసేంది. బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్ర బాబు గతంలో తాకట్టు పెట్టిన బంగారం కోసం ఆయన కుటుంబ సభ్యులు బ్యాంక్కు వెళ్లారు. అక్కడ నామినీగా మాజీ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి అవాక్కయ్యారు.
ఎటువంటి సంబంధం లేని ప్రభావతికి నాగేంద్ర బాబు డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయిందని.. ఆమె ఆ సర్టిఫికెట్తో బంగారం విడిపించుకునేందుకు వస్తే.. బ్యాంక్ అధికారులు ఎలా ఇచ్చారని బాధితులు నిలదీశారు. గతంలోనూ పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ప్రభావతి జైలుకి వెళ్లి వచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి.. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ:సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్లో ప్రకంపనలు
ఖాతాదారుల బంగారం మాయం.. బ్యాంకు ముందు బాధితుల ఆందోళన
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేసిన ప్రభావతి మాయాజాలం
కొన్నేళ్ల క్రితం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన నాగేంద్ర బాబు
ఏడాది క్రితం చనిపోయిన నాగేంద్ర బాబు
నాగేంద్ర బాబు తాకట్టు పెట్టిన… pic.twitter.com/mNTSoVB56X
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026