BigTV English

Ganta Srinivas Rao | నిరుద్యోగులను మోసం చేయడానికే ఇప్పుడు నోటిఫికేషన్లు : టిడిపి నేత గంటా

Ganta Srinivas Rao | ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరుగనుండగా.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం.. జగన్ ప్రభుత్వం వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని తెలుగుదేశం సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం గ్రూప్-1,గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గంటీ శ్రీనివాస్ తప్పుబట్టారు.

Ganta Srinivas Rao | నిరుద్యోగులను మోసం చేయడానికే ఇప్పుడు నోటిఫికేషన్లు : టిడిపి నేత గంటా

Ganta Srinivas Rao | ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరుగనుండగా.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం.. జగన్ ప్రభుత్వం వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని తెలుగుదేశం సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం గ్రూప్-1,గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గంటీ శ్రీనివాస్ తప్పుబట్టారు.


ఇన్ని సంవత్సరాల పాటు నిరుద్యోగులను మోసం చేసి సరిగ్గా ఎన్నికల ముందు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం అని చెప్పారు. అసలు ఉద్యోగాల భర్తీపై జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అందుకే ఎన్నికలకు 5-6 నెలల ముందు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు.

ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేసేందుకు ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ పరీక్షలపై నిరుద్యోగులకు ఆశలు కలిగించి ఇంతవరకు వాటి ఊసే లేదని ఆయన ఎద్దేవా చేశారు.


ఇప్పుడు విడుదల చేసిన గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్ల ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించాలి.. మరి ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఆ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్దాక గ్రూప్-1, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ తతంగమంతా తెలిసే ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు.

Related News

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Big Stories

×