E-Paper
Advertisement

Amaravati News: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?

Amaravati News: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?
Advertisement

Amaravati News: ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు, కొడుకు లోకేష్‌తో సమావేశమయ్యారు. రాజకీయ, వ్యాపార అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత గౌతమ్ అదానీ అమరావతి రావడం ఇదే తొలిసారి.

అమరావతిలో గౌతమ్ అదానీ

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతోంది. ఆనాటి నుంచి ఎప్పుడు అమరావతికి రాలేదు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఎండీ కరణ్ అదానీ. వీరిద్దరు తొలిసారి అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను బుధవారం రాత్రి కలిశారు. నవంబర్ లో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు కరణ్ అదానీ వచ్చారు, రాబోయే పదేళ్లలో ఏపీలో లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు కూడా.

బుధవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు గౌతమ్ అదానీ, కరణ్ అదానీ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత ఏపీ అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించారు. ఏపీలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై చర్చించుకున్నారు. అదానీ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌‌లో గంగవరంలో పోర్టు, విశాఖలో డేటా సెంటర్‌, రాయలసీమలో సిమెంటు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనుంది.

Advertisement

సీఎం చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ

వాటి పెట్టుబడులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల సీఐఐ సదస్సులో కుదుర్చుకున్న సంస్థలు చంద్రబాబు సర్కార్ భూములు కేటాయిస్తోంది. ఇదే క్రమంలో అదానీ సంస్థ చేపట్టిన, చేపట్టనున్న ప్రాజెక్టులపై చర్చకు వచ్చింది. మౌలిక సదుపాయాలు, భవిష్యత్ పెట్టుబడులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి లోకేష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

వైసీపీ హయాంలో కూడా రాత్రి వేళ అమరావతికి వచ్చారు గౌతమ్ అదానీ. అప్పటి మాదిరిగా బుధవారం రాత్రి వచ్చారు.  పగటి వేళ ఎయిర్ ట్రాఫిక్ అధికంగా ఉండడం ఓ కారణంగా తెలుస్తోంది. అందుకోస మే ప్రత్యేక విమానంలో రాత్రి అమరావతికి వచ్చారని అంటున్నారు. కొత్తగా పోర్టుల విషయం చర్చించినట్టు టీడీపీ వర్గాల మాట.  రేపో మాపో అదానీ గ్రూప్ గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశముంది.

ALSO READ: ఎయిడ్స్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ 2030

 

 

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×