BigTV English

Government Employees : బకాయిలు చెల్లించాలి… లేదంటే ఉద్యమం తప్పదు.. బొప్పరాజు హెచ్చరిక..

Government Employees : బకాయిలు చెల్లించాలి… లేదంటే ఉద్యమం తప్పదు.. బొప్పరాజు హెచ్చరిక..

Government Employees : ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంతో తాడే పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమకు సకాలంలో జీతాలు చెల్లించడంలేదని ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల కోసం సన్నాహక సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. తమకు రావాల్సిన బకాయిలనే అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న విమర్శలకు సమాధానమిచ్చారు. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.


ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని బొప్పరాజు కోరారు. ఉద్యోగుల డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం రావాల్సినవి కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. కొత్త జీవోల ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు.

సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని సీఎం జగన్ ను ఉద్దేశించి బొప్పరాజు విమర్శలు చేశారు. ఎవరికీ మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వట్లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్సులు ఇవ్వలేదన్నారు. ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ఆవేదనను ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకు లేదన్నారు. కరోనా బారినపడి ఎందరో ఉద్యోగులు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్‌లు చెల్లించట్లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.


నిన్న సూర్యనారాయణ, నేడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇలా ఉద్యోగ సంఘాల నేతలు జీతాల కోసం నేరుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెడుతుందా? ఉద్యోగులతో చర్చలు జరిపి వారిని చల్లార్చుతుందా? లేదంటే ఉద్యోగుల ఆందోళన బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×