E-Paper
Advertisement

AP Anganwadi Protest : అంగన్‌వాడీలపై ప్రభుత్వం సీరియస్‌.. విధుల్లో చేరని వారిపై చర్యలకు సిద్ధం..

AP Anganwadi Protest : అంగన్‌వాడీలపై ప్రభుత్వం సీరియస్‌.. విధుల్లో చేరని వారిపై చర్యలకు సిద్ధం..
Advertisement

AP Anganwadi Protest : అంగన్‌వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఆందోళన విరమించి.. విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో చర్యలకు సిద్ధమైంది జగన్‌ సర్కార్‌. ప్రభుత్వ డెడ్‌లైన్‌ను పట్టించుకోకుండా ఆందోళన కొనసాగిస్తున్న అంగన్‌వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ జవహర్‌రెడ్డి.

ఎస్మా చట్టం కింద అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీచేసినా విధుల్లో చేరకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తికావడంతో.. ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని కలెక్టర్లకు సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదదర్శి జవహహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

సీఎస్‌ ఆదేశాలతో చర్యలకు సిద్ధమయ్యారు కలెక్టర్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్‌. మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్‌ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధమయ్యారు. విధులలో చేరని అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలగించిన వారి ప్లేస్ లో కొత్తవారిని నియమించేందుకు ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో సమ్మెలో పాల్గొంటూ.. విధులకు హాజరుకాని కార్యకర్తలు మొత్తం 1444, ఆయాలు 931 మంది ఉన్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి అధికారి ఎం.ఎన్. రాణి వెల్లడించారు. విజయనగరం జిల్లా పరిధిలో 4151 మంది అంగన్వాడీలు సమ్మెలో పాల్గొనగా.. 503 మంది తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. మిగతా వారిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వివరించారు.

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×