E-Paper
Advertisement

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!
Advertisement

Gudur Transformer: నెల్లూరు జిల్లా గూడూరు రాజకీయంలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన రామలింగాపురంలో వెలుగు చూసింది. అర్థరాత్రి వేళ జరిగిన ఈ విషాదం వెనుక ఏం జరిగిందనే అంశంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

అర్థరాత్రి విద్యుత్ షాక్.. ఇద్దరి మృతి

Advertisement

గూడూరు మండలం రామలింగాపురం గ్రామ సమీపంలో ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఇద్దరు వ్యక్తులు మృతదేహాలై పడి ఉండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురికావడంతోనే వీరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

చోరీ ముఠా పనేనా?

Advertisement

ఘటనా స్థలంలో ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని రిజిస్ట్రేషన్‌ను పరిశీలించగా.. అది ఓజిలి మండలం సగుటూరుకు చెందిన ఒక మహిళ పేరుతో ఉన్నట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి, వాటిలోని విలువైన రాగి వైర్లను ఎత్తుకెళ్తున్న ముఠాలపై ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా రాగి వైర్లు చోరీ చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తూ షాక్‌కు గురయ్యారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

పోలీసుల దర్యాప్తు తీవ్రం

చనిపోయిన వ్యక్తులు ఎవరు? నిజంగానే వారు వైర్ల చోరీకి వచ్చారా? లేక దీనివెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఘటనా స్థలంలోని ఆధారాలను సేకరిస్తూ మృతుల గుర్తింపు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.

Also Read: జీహెచ్‌ఎంసీ రూటే సెపరేటు.. అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

Tags

Related News

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

Big Stories

Advertisement
×