E-Paper
Advertisement

Kadapa: పులివెందులలో కాల్పులు.. ఒకరు మృతి.. నిందితుడిపై వివేక హత్య కేసులో ఆరోపణలు..

Kadapa: పులివెందులలో కాల్పులు.. ఒకరు మృతి.. నిందితుడిపై వివేక హత్య కేసులో ఆరోపణలు..
Advertisement
gun fire

Kadapa: పులివెందులలో కాల్పుల కలకలం చెలరేగింది. పట్టపగలు, BSNL ఆఫీసు ముందు.. ఇద్దరిపై కాల్పులు జరిపాడు నిందితుడు. దిలీప్, మస్తాన్ బాషాలకు బుల్లెట్లు దిగాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దిలీప్ చనిపోయాడు. చాతి, కడుపులో బుల్లెట్లు దిగడంతో మృతిచెందాడు.

కాల్పులు జరిపింది భరత్ కుమార్ యాదవ్ అని తెలుస్తోంది. కొంతకాలంగా దిలీప్‌తో భరత్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. అదును చూసి దిలీప్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు భరత్ కుమార్ యాదవ్. ఆ సమయంలో దిలీప్‌తో పాటు ఉన్న బాషాపైనా ఫైరింగ్ చేశాడు.

Advertisement

ఇక, భరత్ కుమార్ యాదవ్‌.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఓసారి సీబీఐ అతన్ని విచారించింది. వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్‌ను పరిచయం చేసింది భరత్ కుమారే. ఆ దిశగా సీబీఐ ప్రశ్నించింది. ఆ భరత్ కుమార్ యాదవే ఇప్పుడు ఇలా పులివెందులలో గన్‌తో రెచ్చిపోయాడు. తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒకరు చనిపోవడం, మరొకరికి తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. సీఎం జగన్ సొంత ఇలాఖా కావడంతో.. మరింత సంచలనంగా మారింది. నిందితుడు భరత్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×