E-Paper
Advertisement

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్
Advertisement

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడి వాతావరణం సంతరించుకుంది. ఈ మేరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన సందర్భంగా ఉద్రిక్తతకు దారి తీసింది. తన మామ జగన్మోహన్ రెడ్డికి, అఖిలప్రియకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జరిగాయి.

నంద్యాలలోని విజయ పాల డైరీ పరిశ్రమను మంగళవారం టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే డైరీలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.  దీంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

మాజీ సీఎం జగన్ ఫొటోలను తొలగించి, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేశారు. అనంతరం జగన్ ఫొటోలు అలాగే ఉంచిన సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. ఇక టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదన్నారు.

అలా ఎలా కూర్చుంటావ్..

Advertisement

డైరీకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చారన్న సమాచారం మేరకు విజయ పాల డైరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆమెకు ఫోన్ చేశారు. తన కుర్చిలో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను ఆయన నిలదీశారు.

సిబ్బంది కూర్చోమంటేనే తాను కూర్చున్నానని అఖిల బదులివ్వగా, తన అనుమతి లేకుండా తన సీట్లో కూర్చోనేందుకు నువ్వెవరంటూ ప్రశ్నించారు. దీంతో  అఖిల ప్రియ సైతం అదే రీతిలో సమాధానం చెప్పింది. గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా అంటూ గుర్తు చేసింది.  బెదిరిస్తున్నావా… నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దామని అఖిల ప్రియ తన మామకు సవాల్ విసిరారు. ఈ ఫోన్ సంభాషణతో కర్నూలులో పొలిటికల్ హీట్ పెరిగినట్టైంది.

also read : ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులోకి ఈడీ రంగప్రవేశం… రూ.23.54 కోట్లు సీజ్

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×