E-Paper
Advertisement

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్
Advertisement

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడి వాతావరణం సంతరించుకుంది. ఈ మేరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన సందర్భంగా ఉద్రిక్తతకు దారి తీసింది. తన మామ జగన్మోహన్ రెడ్డికి, అఖిలప్రియకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జరిగాయి.

నంద్యాలలోని విజయ పాల డైరీ పరిశ్రమను మంగళవారం టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే డైరీలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.  దీంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

మాజీ సీఎం జగన్ ఫొటోలను తొలగించి, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేశారు. అనంతరం జగన్ ఫొటోలు అలాగే ఉంచిన సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. ఇక టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదన్నారు.

అలా ఎలా కూర్చుంటావ్..

Advertisement

డైరీకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చారన్న సమాచారం మేరకు విజయ పాల డైరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆమెకు ఫోన్ చేశారు. తన కుర్చిలో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను ఆయన నిలదీశారు.

సిబ్బంది కూర్చోమంటేనే తాను కూర్చున్నానని అఖిల బదులివ్వగా, తన అనుమతి లేకుండా తన సీట్లో కూర్చోనేందుకు నువ్వెవరంటూ ప్రశ్నించారు. దీంతో  అఖిల ప్రియ సైతం అదే రీతిలో సమాధానం చెప్పింది. గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా అంటూ గుర్తు చేసింది.  బెదిరిస్తున్నావా… నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దామని అఖిల ప్రియ తన మామకు సవాల్ విసిరారు. ఈ ఫోన్ సంభాషణతో కర్నూలులో పొలిటికల్ హీట్ పెరిగినట్టైంది.

also read : ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులోకి ఈడీ రంగప్రవేశం… రూ.23.54 కోట్లు సీజ్

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×