E-Paper
Advertisement

Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు.. చంద్రబాబుకు బెయిల్..

Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు.. చంద్రబాబుకు బెయిల్..
Advertisement
Nara Chandrababu Naidu latest news

Nara Chandrababu Naidu latest news(AP political news):

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనకు నాలుగు వారాల బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. ఈలోగా రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక చంద్రబాబు మళ్లీ సరెండర్ కావాల్సిన అవసరం లేదు.

Advertisement

చంద్రబాబు పిటిషన్‌పై గురువారం వాదనలు ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.

Advertisement

లొంగిపోయేటప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌ కవర్లో వైద్య నివేదికలు అందజేయాలన్న కోర్టు ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారన్నారు ఏజీ పొన్నవోలు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవన్నారు. మధ్యంతర బెయిలు పొందిన చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని తెలిపారు.

ఈ కేసులో ఇతర నిందితులకు బెయిలు మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదన్నారు. అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు. తాజాగా ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది.

.

.

.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×